లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంబల్పూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. బులంద్షహర్లోని సంబల్పూర్ సమీపంలో ఓ కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. ఢిల్లీ నుంచి బులంద్షహర్ వస్తున్న ప్రైవేటు బస్సు సంబల్పూర్ సమీపంలో 93వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కష్టంపైన మృతదేహాలను అందులో నుంచి వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్పై కేసు నమోదుచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..