బెంగళూరు: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ప్రత్మేష్ మిశ్రాను కొత్త చైర్మన్ను నియమించారు. ప్రస్తుతం డియాజియో ఇండియాకు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా ఉన్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ ఆర్సీబీ చైర్మన్గా ఆనంద్ కృపాలు ఉన్నారు. ఆర్సీబీ కూడా తమ డియాజియో ఇండియాలో భాగమని ఈ సందర్భంగా ప్రత్మేష్ మిశ్రా అన్నారు. విరాట్ కోహ్లి, మైక్ హెసన్, సైమన్ కాటిచ్లతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రత్మేష్.. 2014లో డియాజియో సీవోవోగా చేరారు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఆర్సీబీ టీమ్కు డియాజియో ఇండియాలో భాగమైన రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిగా ఉంది.