లండన్: కర్నాటక స్పీడ్స్టర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగో టెస్టు ఆడబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నాలుగో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరు కూడా ఉంది. గడిచిన మూడు నెలలుగా కృష్ణ భారత్ జట్టుతోనే ఉంటూ స్టాండ్బైగా సేవలు అందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఓవల్లో గానీ లేదంటే మాంచెస్టర్లో అతడిని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, సిరాజ్లపై పనిభారం తప్పించేందుకు కృష్ణను జట్టులోకి తీసుకుంటామన్న జట్టు అభ్యర్థనను సెలక్షన్ కమిటీ అంగీకరించింది. పాతికేండ్ల ప్రసిద్ధ్.. ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 34 వికెట్లు తీసుకోగా.. భారత్ తరఫున మూడు వన్డేలు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.