దుబాయ్: దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంటులో భారత షట్లర్లు ప్రమోద్ భగత్, సుకాంత్ కదమ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల ఎస్-3 విభాగం సెమీస్లో ప్రపంచ నంబర్వన్ ప్రమోద్ 21-7, 21-17తో మహమ్మద్ హుజైర్ అబ్దుల్(మలేషియా)పై అలవోక విజయం సాధించాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేముల్లో మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. పురుషుల ఎస్-4 సెమీఫైనలో సుకాంత్ కదమ్ 21-11, 21-11తో మార్సెల్
ఆడమ్(జర్మనీ)పై విజయంతో తుదిపోరులో నిలిచాడు.