టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో వరుసగా మూడు రోజుల పాటు పతకాలతో అదరగొట్టిన భారత్కు బుధవారం నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. మూడు రోజుల క్రితం ఆర్2 10 మీటర్ల ఎయిర్రైఫిల్ షూటింగ్లో స్వర్ణం దక్కించుకున్న అవని లేఖరా.. బుధవారం జరిగిన మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ప్రోన్ ఎస్హెచ్1) టీమ్ ఈవెంట్ అర్హత రౌండ్లో విఫలమైంది. బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబర్వన్ షట్లర్ ప్రమోద్ భగత్.. పురుషుల సింగిల్స్ (ఎస్ఎల్3 విభాగం) గ్రూపు-ఏ మ్యాచ్లో మనోజ్ సర్కార్ను 21-10, 21-23, 21-9 ఓడించాడు. అంతకంటే ముందు మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత యువ అథ్లెట్ పాలక్ కోహ్లీ నిరాశపరిచింది. టర్కీ షట్లర్ జెహ్రా చేతిలో ఆమె ఓటమిపాలైంది. మిక్స్డ్ డబుల్స్లో ఆమె ప్రమోద్ భగత్తో కలిసి బరిలోకి దిగిన తొలి రౌండ్లోనే ఓడింది. పురుషుల క్లబ్ త్రో పోటీలో అమిత్ కుమార్, ధరమ్బిర్ ఓటమితో తమ పారాలింపిక్స్ ప్రస్థానాన్ని ముగించారు.