టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో రెండు పసిడి పతకాలు సాధిస్తానని స్టార్ ఇండియా పారా షట్లర్ ప్రమోద్ భగత్ అన్నాడు. ప్రపంచ నంబర్వన్ అయిన ప్రమోద్.. పారాలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ తరఫున పురుషుల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో పోటీ పడుతున్నాడు. పారాలింపిక్స్ గురించి అతడు స్పందిస్తూ.. ‘నేను కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. అంతేగాక నా విజయాలలో ఒలింపిక్ పతకం ఒక్కటే బాకీ ఉంది. ప్రస్తుతం నేను కెరీర్లో అత్యున్నత స్థితిలో ఉన్నాను. 130 కోట్ల భారతీయుల కలలను నేను వమ్ము చేయను. పారాలింపిక్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి స్వర్ణం అందించడం నా కల. దానిని తప్పక నెరవేరుస్తాను. సింగిల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్లోనూ పసిడి నెగ్గుతాన’ని అన్నాడు. చిన్నప్పుడే పోలియో బారిన పడిన భగత్.. వరల్డ్ చాంపియన్షిప్, దుబాయ్ పారా బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకాలు నెగ్గాడు.