బ్రిస్బేన్ హీట్తో ఒప్పందం
మెల్బోర్న్: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళా క్రికెటర్లకు.. బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) నుంచి ఆఫర్లు వరుస కడుతున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి ఏడుగురు ప్లేయర్లు ఈ లీగ్కు ఎంపిక కాగా.. తాజాగా ఈ జాబితాలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ చేరింది. వచ్చే సీజన్ కోసం పూనమ్ యాదవ్తో బ్రిస్బేన్ హీట్ జట్టు ఒప్పందం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో జట్టు యాజమాన్యం పూనమ్ను ఎంపిక చేసుకుంది. భారత్ తరఫున ఓ టెస్టు, 54 వన్డేలు, 71 టీ20లు ఆడిన పూనమ్పై తమకు పూర్తి నమ్మకముందని బ్రిస్బేన్ హీట్ కోచ్ ఆష్లే నాఫ్కే అన్నాడు. భారత్ నుంచి షఫాలీ వర్మ, రాధా యాదవ్, స్మృతి మందన, దీప్తి శర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ వేర్వేరు జట్లతో ఒప్పందాలు చేసుకోగా.. పూనమ్ ఎనిమిదో భారత క్రికెటర్గా నిలిచింది.