డీఎంహెచ్వో, రెడ్క్రాస్ చైర్మన్ సుధాకర్లాల్
అమ్రాబాద్, మార్చి 31: ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి, రెడ్క్రాస్ చైర్మన్ సుధాకర్లాల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అప్పాపూర్, మల్లాపూర్, పుల్లాయపల్లి తదితర చెంచుపెంటల్లో పౌష్టికాహారంపై గిరిజనులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాల శుభ్రత, ఆహార నియమాలు, అలవాట్లను మార్చుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపాదించుకుని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వారికి పౌష్టికాహార కిట్లు, పండ్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఉచితంగా అందజేశారు. జాతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ సహకారంతో రాష్ట్రంలో 3 జిల్లాల్లోని ఆరు చెంచుపెంటలను ఎంచుకున్నారని తెలిపారు. జిల్లాలోని అప్పాపూర్, బౌరాపూర్ పెంటలను ఎంచుకున్నామని తెలిపారు. ఈ పెంటల్లో విద్యావంతులైన వారిని ఎంపికను చేపట్టామని వారికి హైదరాబాద్ రాజ్భవన్లో పౌష్టికాహారంపై అవగాహన కల్పించి వారినుంచి గ్రామాల్లో ప్రతిఒక్కరికీ పౌష్టికాహారం విలువలపై తెలిపేలా తయారు చేస్తామని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ కార్యదర్శి రమేశ్, ఉప వైద్యాధికారి శ్రీధర్, సురేశ్, కమిటీ సభ్యులు వైద్యసిబ్బంది లోక్యానాయక్, రాజేశ్, సరోజ పాల్గొన్నారు.
అయ్యవారిపల్లి తండా సందర్శన
మండలంలోని అయ్యవారిపల్లి తండాను జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్ బుధవారం సందర్శించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన శుభకార్యానికి వెళ్లిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో తండాలో ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. అందులో 18మందికి పాజిటివ్ వచ్చింది. వారితో డీఎంహెచ్వో మాట్లాడి తగిన సూచనలు సలహాలిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు తారాసింగ్, రమణ, నిఖిత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీధర్, సిబ్బంది అశోక్ప్రసాద్, ఫార్మాసిస్ట్ శ్రీనివాసులు, రేణయ్య, సావిత్రి, రమేశ్, జగదీశ్, శీనయ్య, శుభాకర్ పాల్గొన్నారు.