హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. గోవా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేకున్నారు. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా గోవా నుంచి ఇద్దరి వద్ద అక్రమంగా తీసుకొస్తున్న 943 గ్రాముల బంగారం లభించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.44.8 లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని షార్జా నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.