ముంబై : వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ ఐపీఎల్ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఒక్కో జట్టు యూఏఈ చేరేందుకు రెడీ అవుతున్నాయి. ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు (ఎంఐ) యూఏఈ చేరుకున్నది. అయితే, వీరు బయల్దేరిన చార్టర్డ్ విమానం పైలట్.. వినూత్నంగా స్వాగతం పలికే అనౌన్స్మెంట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆటగాళ్ల పేర్లతో కలిపి అనౌన్స్మెంట్ (Creative Announcement) చేశాడు. దీనిలో ఆయా ఆటగాళ్ల ప్రత్యేకతలను కూడా తీసుకున్నాడు.
ముంబై విమానాశ్రయం నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానం అబు దాబికి బయల్దేరింది. అయితే, ఈ విమానం పైలట్ చేసిన అనౌన్స్మెంట్ మాత్రం అదిరిపోయింది. సిక్సర్లు, ఫోర్లు కొడుతూ.. వికెట్లు తీస్తూ అభిమానులను అలరించే క్రికెటర్లు.. ఏకంగా తమపై విమానం అనౌన్స్మెంట్ మాదిరిగా పైలట్ ప్రకటన చేసి ఆకట్టుకున్నాడు. తన అనౌన్స్మెంట్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, ఇషాంత్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తదితరుల పేర్లతోపాటు వారి ప్రత్యేకతను కలుపుతూ హుషారుగా మాటలు కలిపాడు. భారతదేశం-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ప్రస్తుతం బిజీగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి అనేక మంది కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఇండియన్స్ వారి శిక్షణా శిబిరాన్ని అబు దాబిలో ప్రారంభించనున్నది. అనేక మంది విదేశీ ఆటగాళ్లు కూడా వారి జాతీయ కట్టుబాట్ల కారణంగా జట్టులో చేరనున్నారు.
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడానికి ముందు అబు దాబిలో కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. యూఏఈలో ఐపీఎల్ 2020 సందర్భంగా ముంబై ఇండియన్స్ ఇక్కడే జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించి రికార్డు స్థాయిలో ఐదవ టైటిల్ను సొంతం చేసుకున్నది. ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఏడు మ్యాచ్లు ఆడి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. సెప్టెంబర్ 19 న ప్రధాన ప్రత్యర్తి చెన్నై సూపర్ కింగ్స్తో ముఖాముఖి పోటీతో సీజన్ను తిరిగి ప్రారంభించనున్నారు.
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
లండన్లో క్రికెటర్ల జెండా పండుగ
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..