తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తక్షణమే అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ సీట్లు పెంచేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలన్నారు. శనివారం మంత్రుల నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కోణంలోనే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ సీట్లు పెంచుకునేందుకు బీజీపీ ప్రయత్నిస్తుందని బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. జమ్మూకశ్మీర్ అఖిలపక్ష సమావేశంలో బీజేపీ కుట్రలు బట్టబయలు అయ్యాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు సీట్ల పెంపు కుదరదని.. అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు. అదే జమ్మూకశ్మీర్లో మాత్రం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా.. ఇదెక్కడి న్యాయమని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కుయుక్తులు పక్కనబెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొత్త లేఅవుట్లను అనుమతించొద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు
ఈటలపై బీజేపీ నాయకుల సంచలన వ్యాఖ్యలు
ఉపాధి హామీ పథకం కింద రూ. 1,432 కోట్లు మంజూరు
కరోనా పంజా.. టాప్ మావోయిస్టు నేతల మరణం.. వైరస్ బారిన మరికొందరు..!