లుసానే: టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న అథ్లెట్లు, అధికారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఫైజర్, బయోన్టెక్ ముందుకొచ్చాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) గురువారం వెల్లడించింది. ఫైజర్ వ్యాక్సిన్ డోసుల డెలీవరి ఈ నెలలోనే మొదలవుతుందని, జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభంలోగా క్రీడల్లో పాల్గొనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఐవోసీ భావిస్తున్నది. చైనాకు చెందిన ఓ సంస్థ సైతం ఒలింపిక్ అథ్లెట్లకు వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించినా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో వాటికి అనుమతి లభించలేదు. ఇప్పుడు ఫైజర్ ముందుకు రావడంతో ఎక్కువ మంది అథ్లెట్లకు వ్యాక్సిన్ అందే అవకాశం లభించింది. మరోవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికీ టోక్యో ఒలింపిక్స్ జరుగడంపై అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి.