రంగారెడ్డి : జిల్లాలోని షాబాద్ మండలం నారగూడ వద్ద వ్యక్తి హల్చల్ చేశాడు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు ఇతడి వాహనాన్ని సవాధీనం చేసుకున్నారు. వాహనం ఇవ్వడం లేదని పేర్కొంటూ స్తంభం ఎక్కి హల్చల్ సృష్టించాడు. బైక్ ఇప్పిస్తామని అతడిని పోలీసులు కిందకు దించారు. అదుపులోకి తీసుకుని ఐపీసీ 309 కింద కేసు నమోదు చేశారు.