అమరావతి : విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. విశాఖ మేయర్గా, ఎంపీగా సబ్బం హరి ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు.
సబ్బం హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.