హన్మకొండ సిటీ, ఏప్రిల్ 4 : వరంగల్ సీపీగా హైదరాబాద్ ఎస్బీ జాయింట్ కమిషనర్ పని చేస్తున్న ఐపీఎస్ తరుణ్ జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రమోద్కుమార్ సీఐడీ ఐజీగా పని చేస్తూ వరంగల్ రేంజ్ ఇన్చార్జి డీఐజీ, వరంగల్ కమిషనరేట్ ఇన్చార్జి సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, సీపీ బాధ్యతల నుంచి ప్రమోద్కుమార్ను రిలీవ్ చేస్తూ తరుణ్ జోషీకి సీపీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఇన్చార్జి సీపీగా ప్రమోద్కుమార్ బాధ్యతలు నిర్వర్తించిన తొమ్మిది నెలల కాలంలో అవినీతి అధికారుల్లో వణుకు పుట్టించాడు. సస్సెన్షన్, అటాచ్లతో అధికారుల గుండెల్లో హడల్ పుట్టించడంతో పాటు అనవసర వివాదాల్లో తలదూర్చకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వర్తించేలా తనకంటూ ఒక మార్క్ను సృష్టించారు.
ఇవి కూడా చూడండి..
గ్రేటర్లో న్యూ జనరేషన్ ట్రామ్ వే
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి ఈటల