ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశను యూఏఈ వేదిక నిర్వహిస్తామని
బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ఆ ఫ్రాంఛైజీకి షాకిచ్చాడు. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ల్లో తాను పాల్గొనబోనని కమిన్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఐతే తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించలేదు.
‘ఫ్యామిలీ కారణాల వల్ల డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ వెస్టిండీస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకోవచ్చు. చాలా రోజుల నుంచి బయో బబుల్లో ఉంటున్న మరికొంత మంది కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కమిన్స్ ఈ ఏడాది సీజన్లో మళ్లీ లీగ్లో ఆడేదిలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు’ ఓ నివేదిక పేర్కొంది.