టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో భారత్కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.
పారాలింపిక్స్లో భారత్కు నేడు రెండు పతకాలు లభించాయి. అంతకుముందు ఉత్తరప్రదేశ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. బ్యాడ్మింటన్ పురుషుల ఎస్ఎల్ 4 విభాగంలో ప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్తో జరిగిన ఫైనల్లో 2-1 తేడాతో ఓడిపోయాడు.
కృష్ణ నాగర్ సాధించిన గోల్డ్ మెడల్తో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, ఐదు బంగారు పతకాల్లో రెండు బ్యాడ్మింటన్ నుంచే ఉండటం విశేషం.