దుబాయ్: ఇటీవలి కాలంలో ఫా ర్మాట్లతో సంబం ధం లేకుండా విజృంభిస్తున్న టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లో దంచికొట్టిన పంత్.. 747 ర్యాంకింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలువగా.. ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ ఆటగాడు హెన్రీ నికోల్స్ కూడా అన్నే పాయింట్లతో ఉమ్మడిగా ఆరో ర్యాంక్లో ఉన్నారు. పంత్ టాప్-10లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కాగా.. భారత్ నుంచి అత్యుత్తమంగా విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్లో ఉండగా.. ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంక్ల్లో ఉన్నారు. భారత టెస్టు స్పెషలిస్టులు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే 14, 15వ స్థానాల్లో నిలిచారు.