ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ (52 కేజీలు) ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంగల్ 5-0తో సాకెన్ బిబోసినోవ్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు. టాప్ సీడ్గా బరిలోకి దిగిన పంగల్.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టాడు. మరో సెమీస్లో టాప్సీడ్, డిఫెండింగ్ చాంపియన్ బహదూర్ ఉస్మనోవ్ (తజకిస్థాన్)ను భారత బాక్సర్ శివథాపా (64 కేజీలు) మట్టికరిపించగా.. 60 కేజీల సెమీఫైనల్లో డానియల్ (ఇరాన్) చేతిలో వరిందర్ సింగ్ ఓటమి పాలయ్యాడు.