హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావంలోనూ.. తన ప్రాక్టీస్ సజావుగా సాగిందని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పేర్కొంది. రియో (2016) ఒలింపిక్స్లో రజతం నెగ్గిన సింధు.. టోక్యోలో పసిడి పట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం సింధు మాట్లాడుతూ.. ‘కరోనా వల్ల వచ్చిన విరామం నాకు మంచే చేసింది. ఈ సమయంలో టెక్నిక్ను మరింత మెరుగుపరుచుకున్నా. బిజీ షెడ్యూల్ కారణంగా చాలాసార్లు సరైన ప్రాక్టీస్ సమయం లభించదు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా విశ్వక్రీడలకు సిద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం చిక్కింది. అంచనాలు భారీగా ఉంటాయని తెలుసు. వాటిని నిజం చేస్తూ.. పతకంతో తిరిగి రావాలనుకుంటున్నా’అని చెప్పుకొచ్చింది.