దక్షిణాఫ్రికాపై పాక్ జయభేరి
సెంచూరియన్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్ల సిరీస్లో పాక్ 2-1తో ముందంజ వేసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. జానెమన్ మలన్ (55), మార్క్మ్ (63) అర్ధశతకాలు సాధించారు. ఛేదనలో పాక్ 18 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది. సారథి బాబర్ ఆజమ్ శతక్కొట్టగా.. మరో ఓపెనర్ రిజ్వాన్ (73 నాటౌట్) రాణించాడు.