రెండో మ్యాచ్లోనూ అదే జోరు. పాకిస్థాన్ స్ట్రాటజీ మరోసారి వర్కవుట్ అయింది. న్యూజిలాండ్పై పాక్ అనూహ్య విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్లో విజయయాత్ర కొనసాగిస్తోంది. 18.4 ఓవర్లలోనే కేవలం 5 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 135 పరుగులు చేసి న్యూజిలాండ్పై గెలిచింది.
తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి పాకిస్థాన్కు 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. పాక్ బౌలర్లు చెలరేగిపోవడంతో తక్కువ స్కోర్కే న్యూజిలాండ్ పరిమితం అయింది.
పాకిస్థాన్ ప్లేయర్లలో రిజ్వాన్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆసిఫ్ అలీ 12 బంతుల్లో 27 పరుగులు, షోయబ్ మాలిక్ 20 బంతుల్లో 26 పరుగులు చేసి పాకిస్థాన్కు విజయం అందించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధి 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. సాంత్నర్ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశాడు. టిమ్ సౌథీ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశాడు. ట్రెంట్ బౌల్ట్ 3.4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
పాకిస్థాన్ బౌలర్ హరిశ్ రౌఫ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 22 పరుగులనే హరిశ్ అందించాడు.