హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక పాకిస్థాన్ గెలుపు ముంగిట నిలిచింది. ఏకపక్షంగా సాగుతున్న పోరులో పాక్ విజయానికి మరో వికెట్ దూరంలో ఉంది. నౌమన్ అలీ (5/86), అఫ్రిది (4/45) ధాటికి జిం బాబ్వే రెండో ఇన్నింగ్స్లో(ఫాలోఆన్) 9 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చక్బవ(80) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 52/4 తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 132 పరుగులకే కుప్పకూలింది. హసన్ అలీ(5/27) ఐదు వికెట్లతో అదరగొట్టాడు.