ఇస్లామాబాద్: పాకిస్థాన్ టీ20 జట్టులోకి మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజమ్ ఖాన్కు చోటు దక్కింది. 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఇటీవల జరిగిన టీ20 మ్యాచుల్లో అతను సెన్షేషన్ ప్లేయర్గా మారాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్లకు అతన్ని ఎంపిక చేయడం ఆశ్చర్యమే. మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజమ్ ఖాన్ ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్లు ఆడాడు. సిక్సర్లు కొట్టడంలో అతను స్పెషలిస్టు. పాకిస్థాన్ సూపర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్లో భారీ షాట్లతో అలరించాడు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరనున్నది. జూలై 8 నుంచి 20 వరకు ఇంగ్లండ్తో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత విండీస్తో అయిదు టీ20లు, రెండు టెస్టులు ఉంటాయి.