దుబాయ్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకుగాను ఈ ఇద్దరికీ అవార్డులు దక్కాయి. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించిన ఆజంకు అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజం.. 13 పాయింట్లు సాధించి మొత్తం 865 పాయింట్లతో కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక అదే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలవడంలోనూ బాబర్ కీలకపాత్ర పోషించాడు.