షార్జా: పాకిస్థాన్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు గప్తిల్ (17), డారిల్ మిషెల్ (21 నాటౌట్) జట్టుకు శుభారంభం అందించారు. గప్తిల్ ఆచితూచి ఆడగా మిచెల్ ధాటిగా ఆడాడు. అయితే పవర్ప్లే చివరి ఓవర్లో హారిస్ రౌఫ్ వేసిన బంతిని గప్తిల్ బలంగా బాదడానికి ప్రయత్నించాడు.
ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని తొడకు తగిలి ఎగిరి వికెట్లకు తగిలింది. దీంతో అతను పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. తొలి ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన న్యూజిల్యాండ్ 42 పరుగులు చేసింది.