టోక్యో : ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. 2-6 తేడాతో దక్షిణ కొరియా చేతిలో భారత జోడీ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ ఓడిపోయారు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రీ క్వార్టర్ ఫైనల్లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్ను దీపికా కుమారి, జాదవ్ కలిసి ఓడించారు.
పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరింది. ఈ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్కు అర్హత సాధించాడు. 586 పాయింట్లతో సౌరభ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో భారత షూటర్ అభిషేక్ వర్మ అర్హత సాధించలేకపోయాడు. 575 పాయింట్లతో అభిషేక్ వర్మ 17వ స్థానంలో నిలిచాడు.