టోక్యో: పారాలింపిక్స్ తొలిరోజు భారత్కు నిరాశే ఎదురైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో పోటీ పడ్డ ఇద్దరు భారత ప్యాడ్లర్లు భవీనాబెన్ పటేల్, సోనాల్బెన్ పటేల్ తొలిరౌండ్లో ఓటమితో ప్రస్థానాన్ని ప్రారంభించారు. బుధవారం జరిగిన మహిళల క్లాస్-3 కేటగిరీలో సోనాల్బెన్.. లీ క్వాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. మొదటి మూడు గేమ్స్లో ఆధిక్యం ప్రదర్శించిన సోనాల్బెన్.. చివరివరకు అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. ఫలితంగా 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో లీ చేతిలో ఓడిపోయింది. లీ ప్రపంచ నాలుగో ర్యాంకరే గాక రియో (2016) పారాలింపిక్స్లో రజతం సాధించింది. ఇక మహిళల క్లాస్-4 కేటగిరీలో పోటీ పడ్డ భవీనాబెన్ కూడా ప్రపంచ నంబర్వన్ జౌయింగ్ (చైనా) చేతిలో 3-11, 9-11, 2-11 తేడాతో ఓటమి పాలైంది.