2వేల కాన్సన్ట్రేటర్ల పంపిణీకి సిద్ధం
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న దేశానికి చేయూత అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. 10 లీటర్ల సామర్థ్యమున్న 2వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ‘కరోనా వైరస్పై పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు 2వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను బోర్డు పంపిణీ చేయనుంది. వైరస్ రెండోవేవ్ వల్ల ఊహించని పరిస్థితులు తలెత్తడంతో ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కాన్సంట్రేటర్లను రానున్న నెలల్లో పంపిణీ చేస్తాం’ అని బోర్డు సోమవారం వెల్లడించింది. మరోవైపు కరోనా వల్ల గతేడాది రంజీ ట్రోఫీ రద్దు కావడంతో దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన బీసీసీఐ.. పంపిణీ ఎలా చేయాలన్న విషయంపై కసరత్తులు మొదలుపెట్టామని బోర్డు కోశాధికారి ధుమాల్ పేర్కొన్నాడు.
పాండ్యా బ్రదర్స్ కూడా..
కరోనా సహాయక చర్యల్లో భారత యువ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మరోసారి భాగస్వాములయ్యారు. కరోనా సెంటర్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపారు.