హైదరాబాద్: ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అమెరికన్ సంస్థ అయిన మెడ్ట్రానిక్.. నగరంలోని నానక్రామ్గూడా బీఎస్ఆర్ టెక్పార్క్లో రూ.1200 కోట్లతో కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విడుతల వారీగా మరో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనుంది. మెడ్ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్లోనే తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..