న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్, బెల్జియం మధ్య ఇవాళ జరిగిన హాకీ సెమీఫైనల్ మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు పట్ల, ఆటగాళ్ల నైపుణ్యం పట్ల గర్వంగా ఉందని ఆయన తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మోదీ ట్వీట్ చేస్తూ.. గెలుపు ఓటములు జీవితంలో భాగం అన్నారు. ఇవాళ జరిగిన సెమీస్లో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. టోక్యోలో మెన్స్ హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, అదే చాలా కీలకమైందని, తర్వాత మ్యాచ్లో ఉత్తమంగా రాణించాలని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. భారతీయ హాకీ ప్లేయర్ల పట్ల దేశం గర్వంగా ఉందని ఆయన అన్నారు.