మహిళల సింగిల్స్లో జపాన్ స్టార్ ప్లేయర్, 4 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత నవోమీ ఒసాక సునాయాస విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఒసాక 6-4, 7-6 (7/4)తో పాట్రికా మారియాటిగ్పై గెలిచింది. అయితే మరోసారి మీడియా సమావేశాన్ని ఒసాక బహిష్కరించింది. దీంతో నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించారు. కాగా మరో మ్యాచ్లో మాజీ ప్రపంచ నంబర్వన్ అంజెలిక్ కెర్బెర్ (జర్మనీ) 2-6, 4-6తో క్వాలిఫయర్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్) చేతిలో ఓడి, మట్టికోర్టులో పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కాగా కరోనా ప్రభావం తగ్గడంతో పోటీలకు 5వేల మంది అభిమానులను నిర్వాహకులు అనుమతించారు.