లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ క్రికెట్ టీమ్ను కరోనా వణికిస్తోంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా ఓ స్టాఫ్ మెంబర్కు కూడా పాజిటివ్గా తేలినట్లు సమాచారం. అతనితోపాటు మరో ముగ్గురు కోచింగ్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. వీళ్లెవరూ టీమ్తో కలిసి డర్హమ్ వెళ్లడం లేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమ్ సభ్యులు బయో బబుల్ నుంచి బయటకు వెళ్లారు. కొందరు యూరో ఫుట్బాల్ మ్యాచ్లు చూడటానికి వెళ్లారు. రిషబ్ పంత్ కూడా అలా యూరోకి వెళ్లే కరోనా బారిన పడ్డాడు. యూకేలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జే షా ప్లేయర్స్కు మెయిల్ కూడా చేశారు.