సిద్దిపేట : రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు సమక్షంలో ఇల్లంతకుంటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యాడద తిరుపతి రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి హరీష్ రావును జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు కలిశారు. తామంతా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు.