పుణె: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అలవోకగా బ్రేక్ చేస్తున్నాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత సొంత గడ్డపై అత్యంత వేగంగా 10 వేల పరుగులు(అన్ని ఫార్మాట్లలో కలిపి) పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా కోహ్లీ ఈ మైలురాయి చేరుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ 195 ఇన్నింగ్స్ల్లో 61.74 సగటుతో స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్లో 10002 పరుగులు సాధించాడు.
ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సొంతగడ్డపై 10వేల రన్స్ పూర్తి చేయడానికి 219 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 223 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. మాజీ ఆటగాళ్లు మహేల జయవర్దనే(224 ఇన్నింగ్స్లు), కుమార సంగక్కర(229), జాక్వెస్ కలీస్(236) తమ సొంతగడ్డపై 10వేల పరుగుల మార్క్ అధిగమించినప్పటికీ కోహ్లీ మాదిరిగా ఒక్కరు కూడా 200 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించలేదు.