హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ)ః టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న తెలంగాణ ప్లేయర్లు సానియా మీర్జా, సాయి ప్రణీత్ సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.