టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో ( Olympics ) అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ ఉదయం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత హాకీ టీమ్ 1-0 తేడాతో విజయం సాధించి సెమీస్లో దూసుకెళ్లింది. దాంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల హాకీ టీమ్ అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని భారత్లో ఆస్ట్రేలియా రాయబారి బ్యారీ ఓ ఫారెల్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.
భారత మహిళల హాకీ జట్టును అభినందిస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ.. ఆట చివరి వరకు భారత్ డిఫెన్స్ చెక్కుచెదరలేదని, అదే ఆ జట్టు పై చేయి సాధించడానికి కారణమైందని బ్యారీ ఫారెల్ ట్వీట్ చేశారు. సవితా పూనియా భారత డిఫెన్స్లో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాలా నిలించిందని ఆయన పేర్కొన్నారు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో కూడా భారత్ విజయం సాధించాలని ఫారెల్ ఆకాంక్షించారు.