న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన మీరాబాయ్ చానుకు ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. టోక్యో నుంచి నేరుగా కాసేపటి క్రితం ఆమె తన కోచ్తో కలిసి ఢిల్లీ చేరుకున్నది. అక్కడ ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. అయితే విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడే ఆమెకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయంలో భారీ సెక్యూర్టీ మధ్య ఆమె బయటకు వచ్చింది. ఆ సమయంలో అభిమానులు కేరింతలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది చానుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.