న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అతడి ఆచూకీ లభించకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు అతడి జాడ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో సుశీల్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ అందుకు నిరాకరించారు. ఈనెల 4న జరిగిన ఓ గొడవలో యువ రెజ్లర్ సాగర్ మృతి చెందాడు.