టోక్యో: 13 ఏండ్ల జపాన్ అథ్లెట్ స్వర్ణం గెలిచిన రోజే టోక్యో ఒలింపిక్స్లో మరో అరుదైన విశేషం జరిగింది. 58 ఏండ్ల వయసులో కువైట్ వెటరన్ షూటర్ అబ్దుల్లా అల్ రషీద్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. వయసు సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ మెడల్ కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల షూటింగ్ స్కీట్ ఫైనల్లో అబ్దుల్లా 46 పాయింట్లు సాధించి సత్తాచాటాడు. అల్ రషీద్కు వరుసగా ఇది రెండో ఒలింపిక్స్ పతకం అయినా.. దేశం తరఫున ఇదే మొదటిది. 2016 ఒలింపిక్స్లో కాంస్యం సాధించినా అప్పుడు కువైట్పై నిషేధం ఉండడంతో స్వతంత్ర అథ్లెట్గా అతడు బరిలోకి దిగాడు. 1996లో తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగిన అబ్దుల్లాకు విశ్వక్రీడల్లో పాల్గొనడం ఇది ఆరోసారి. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్లోనూ బరిలోకి దిగుతానని, స్వర్ణమే తన లక్ష్యమని అతడు చెప్పడం విశేషం. కాగా స్కీట్ విభాగంలో అమెరికా షూటర్ విన్సెంట్ హన్కాక్ స్వర్ణం దక్కించుకోగా.. జాస్పెర్ హన్సెన్ (డెన్మార్క్) రజతం పట్టాడు.