న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ (125 కేజీలు)పై నిషేధం పడింది. మెగాటోర్నీకి ముందు డోప్ టెస్టులో విఫలమవడంతో అతడిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూబ్ల్యూ) స్పష్టం చేసింది. ‘యూడబ్ల్యూడబ్ల్యూ నుంచి గురువారం మెయిల్ అందింది. డోప్ టెస్టులో విఫలమైన సుమిత్ మాలిక్పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘బి’ శాంపిల్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్నం’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.