భువనేశ్వర్: ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న పురుషుల హాకీ జూనియర్ వరల్డ్కప్ టోర్నీకి ఒడిశా ఆతిథ్యమివ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. గురువారం మెగాటోర్నీకి సంబంధించిన ట్రోఫీ, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ.. ‘కరోనా కష్టకాలంలో మెగాటోర్నీకి ఎక్కువ వ్యవధి లేకున్నా. ఏర్పాట్లు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వదేశంలో ప్రపంచకప్ జరుగడం భారత ఆటగాళ్లకు లాభదాయకం. కళింగ స్టేడియం వేదికగా నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రపంచకప్ నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.