భువనేశ్వర్: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్త్న్ర కోసం స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ పేరును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసులో రజత పతకాలు సాధించిన ద్యుతీ.. తాజా ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగు పందెంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించేందుకు 0.02 సెకన్ల దూరంలో నిలిచిపోయిన ద్యుతీ.. ర్యాంకింగ్స్ ఆధారంగా విశ్వక్రీడలకు చేరే అవకాశాలున్నాయి. ‘ఖేల్త్న్ర అవార్డుకు నా పేరు సిఫారసు చేసినందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు ధన్యవాదాలు’అని ద్యుతి మంగళవారం ట్విట్టర్లో పేర్కొంది. 25 ఏండ్ల ద్యుతీచంద్ గతేడాది అర్జున అవార్డు అందుకుంది.