దుబాయ్: నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్స్లో భారత్కు పతకం తీసుకొచ్చిన హాకీ జట్టులో కీలక సభ్యుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు యూఏఈ వేదికగా పనిచేస్తున్న ఒక వైద్య సంస్థ భారీ నజరానా ప్రకటించింది. శ్రీజేష్కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్టు వీపీఎస్ హెల్త్ కేర్ చైర్మన్ శంషీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ‘ఒలింపిక్స్లో శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వించేలా చేశాడు. మళయాళిగా అతడు (శ్రీజేష్ కూడా కేరళీయుడే) సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది’ అని అన్నారు. శ్రీజేష్కు ఫోన్ చేసి మాట్లాడిన శంషీర్ అతడికి కోటి రూపాయల ప్రోత్సాహకం ప్రకటించారు. ఇదే విషయమై శ్రీజేష్ మాట్లాడుతూ.. శంషీర్ జట్టుకు ఏ అవసరమున్నా ముందుటానని తనతో చెప్పినట్లు తెలిపాడు.