ముంబై: క్రీడా, సినీ రంగ ప్రముఖులను కంపెనీలు తమ ప్రచారానికి అనువుగా మలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాయి. ముఖ్యంగా వార్త ల్లో వ్యక్తులకు ప్రాముఖ్యం కల్పిస్తూ ప్రకటనలు రూపొందిస్తాయి. ఇప్పుడు ఇదే కోవలో ఒక ప్రకటన అందరినీ ఆకర్షిస్తున్నది. అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ ఫొటోతో ఒక బీడీ కంపెనీ ప్యాకెట్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ‘భారత్లో మెస్సీ తొలి వాణిజ్య ఒప్పందం’ అంటూ ఒక వ్యక్తి బీడీ ప్యాకెట్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. ఈ ట్వీట్ చూసిన వారంతా సెటైర్లు వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోపా అమెరికా కప్లో అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.