దుబాయ్: ఆస్ట్రేలియా (2016), ఇంగ్లండ్ (2017)తో భారత్ ఆడిన టెస్టుల్లో ఫిక్సింగ్ జరిగిందన్న ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టిపారేసింది. ఆల్ జజీరా చానెల్ డాక్యుమెంటరీ కుట్రపూరితమని, నిరాధారమని సోమవారం ప్రకటించింది. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో, 2017లో రాంచీలో ఆస్ట్రేలియాతో కోహ్లీసేన ఆడిన టెస్టులు ఫిక్సయ్యాయంటూ ఆల్జజీరా ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరిట ఓ డాక్యుమెంటరీని 2018లో విడుదల చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీసీ.. ఆల్జజీరా విడుదల చేసిన డాక్యుమెంటరీలో ఐదుగురు చెప్పిన విషయాలు నిరాధారమని స్పష్టం చేసింది. అనవసర విషయాలతో అబద్ధపు ఆరోపణలు చేశారని తేల్చింది.