రాణిపేట్: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మొహమ్మద్జాన్ మంగళవారం రోజున గుండెపోటుతో మృతిచెందారు. రాణిపేట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత విరామం తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఎంపీ మొహమ్మద్జాన్ వయసు 73 ఏళ్లు. ఎన్నికల ప్రచారం నిర్వహించి లంచ్ కోసం ఇంటికి వచ్చిన సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఛాతిలో నొప్పిరావడంతో.. ఆయన్ను వలాజాపేట ప్రభుత్వ జిల్లా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. డాక్టర్లు కార్డియో పల్మోనరీ చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. 2011-16 నుంచి రాణిపేట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. 2019 జూలైలో ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మొహమ్మద్జాన్ మృతి పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతాపం ప్రకటించారు.