Sports
- Jan 04, 2021 , 21:57:15
తైక్వాండో క్రీడాకారిణి శ్రీనిఖకు ఎమ్మెల్సీ కవిత అభినందన

ఆర్మూర్: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తొండాకూర్కు చెందిన మద్దుల శ్రీనిఖను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అభినందించారు. గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు నిర్వహించిన సీఎం కప్ ఆన్లైన్ ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో (అండర్-11) శ్రీనిఖ పాల్గొని అద్భుత ప్రతిభను ప్రదర్శన చేసింది.
శ్రీనిఖను సోమవారం హైదరాబాద్లో కవితతో పాటు జీవన్రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జాతీయ విలువిద్య క్రీడాకారుడు మద్దుల మురళి, తైక్వాండో కోచ్ హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
MOST READ
TRENDING