హిస్సార్: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (52 కేజీలు), గొనెల్ల నిహారిక (64 కేజీలు) సెమీఫైనల్కు దూసుకెళ్లారు. సోమవారం జరిగిన క్వార్టర్స్లో విజయాలు సాధించిన ఈ ఇద్దరూ కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. నిఖత్ 5-0తో మంజు (అస్సాం)పై విజయం సాధించగా.. నిహారిక 5-0తో బబిత (ఉత్తరాఖండ్)ను చిత్తు చేసింది. ఇతర పోటీల్లో మంజురాణి, కళైవాణి, జమున, గాయత్రి, శిక్ష, బేబి రోజిసన, కోమల్ ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్లో అడుగుపెట్టారు.