ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. చెన్నై తన తర్వాతి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పంజాబ్తో మ్యాచ్కు పేసర్లు లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెండార్ఫ్ జట్టులో అందుబాటులో ఉండరని చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు.
‘ఎంగిడి అందుబాటులో ఉండడు. తర్వాతి మ్యాచ్ కూడా ఆడడు. టోర్నీ ఆరంభానికి ముందు స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ సీజన్ నుంచి తప్పుకోవడం మాకు ఎదురుదెబ్బే. ఎంగిడి త్వరలోనే తుది జట్టులోకి వస్తాడు. ఆ తర్వాత బెహ్రెండార్ఫ్ కూడా టీమ్లో చేరతాడు. బౌలింగ్ విభాగంలో మేం కొంత బలహీనంగా ఉన్నాం. అయినా, మేం భారత బౌలర్లవైపే చూస్తున్నాం. అంతర్జాతీయ బౌలర్ సామ్ కరన్ కూడా ఉన్నాడని’ ఫ్లెమింగ్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నాడు.
పాకిస్థాన్ పర్యటన నుంచి నేరుగా భారత్కు వచ్చిన సౌతాఫ్రికా పేసర్ ఎంగిడి
క్వారంటైన్లో ఉన్నాడు. హేజిల్వుడ్ స్థానంలో బెహ్రెండార్ఫ్ను జట్టులోకి తీసుకున్నట్లు ఇటీవల ఫ్రాంఛైజీ ప్రకటించింది.